Friday, April 19, 2024

గంగమ్మ తల్లికి సారె సమర్పించిన – ఎండోమెంట్ కమిషనర్ హరి జవహర్ లాల్

తిరుపతి సిటీ ప్రభ న్యూస్ : గంగమ్మ తల్లికి సారె సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ అన్నారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి తగిన చర్యలు చేపడతామని వెల్లడించారు.
జాతర పర్వదినాన్ని పురష్కరించుకుని .. సతీసమేతంగా విచ్ఛేసి, తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమరించారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు..రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ హరి జవహర్ లాల్ దంపతులు అమ్మవారి సేవలో పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆలయ ఎదుట స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేపట్టారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో హరి జవాహర్ లాల్ పాల్గొన్నారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష, గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపీ యాదవ్, ఈవో ముని కృష్ణయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement