Friday, March 29, 2024

కరోనా ముందు జాగ్రత్త… ముక్కులో నిమ్మసం వేసుకుని మృతి

దేశంలో కరోనా మహమ్మారి విచ్చలవిడి గా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కరోనా రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి… కరోనా రాకుండా ఉండాలంటే ఇవి తినాలి అంటూ సోషల్ మీడియాలో వాట్సాప్ లలో రకరకాల ఫార్వర్డ్ మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. అయితే అలా వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ చదివి ముక్కులోకి నిమ్మరసం వేసుకుని మృతిచెందాడు ఓ ఉపాధ్యాయుడు. కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా ముక్కులోకి నిమ్మరసం పిండుకుని ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురయ్యాడు.

ముక్కులో నిమ్మరసం పిండితే..ఊపిరితిత్తులలోని కపం బయటపడి కరోనా బారిన పడకుండా ఉండొచ్చని రాయచూర్ సింధనూరులోని శరణ బసవేశ్వర కాలనీలో నివాసం
ఉంటున్న ఉపాధ్యాయుడు బసవరాజ్(43) నిమ్మరసం పిండుకోగా, అస్వస్థతకు గురై మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement