Thursday, April 25, 2024

తేజ హీరోగా ‘హనుమాన్’ షురూ

‘అ’, ‘జాంబీ రెడ్డి’ సినిమాలతో ఆకట్టుకున్న విభిన్న ప్రతిభ గల దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా ‘హనుమాన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఫిక్ష‌న‌ల్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌నే విష‌యాన్ని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. తేజ స‌జ్జా హీరోగా రూపొంద‌నున్న ఈ చిత్రం శుక్రవారం నాడు పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ కార్యక్రమానికి నిర్మాత సి. క‌ళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. అతి త్వ‌ర‌లోనే మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘జాంబీరెడ్డి’లోనూ తేజ సజ్జనే హీరోగా నటించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement