Thursday, April 25, 2024

రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వీరితో పాలు ఈ సమావేశంలో ప్రియాంకగాంధీ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.. అయితే ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ లో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. సీఎం అమరీందర్ తో నవజ్యోత్ సింగ్ సిద్ధూ విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీలతో ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, పంజాబ్ ఎన్నికల గురించి వీరు చర్చించుకున్నారా? లేక జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటు చేయాలనే కోణంలో భాగంగా కలిశారా? అనే చర్చ జరుతుతోంది. ఈ భేటీకి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: నగరంలో భారీ వర్షాలు.. క్షేత్ర స్థాయిలో మేయర్ పర్యటన

Advertisement

తాజా వార్తలు

Advertisement