Friday, April 19, 2024

గోనె ప్రకాశ్ రావు దిష్టిబొమ్మతో శవయాత్ర..

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఆరోప‌ణ‌లు చేశారు. వాటిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గోనె ప్రకాశ్ రావు శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఆయ‌న దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మంత్రి డబ్బులు వసూలు చేశారని ప్రకాష్ రావు చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. అసత్యపు ఆరోపణలు మంత్రిపై చేస్తే సహించమని, గోనె ప్రకాశరావు తగిన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement