Saturday, April 20, 2024

గ్రూప్‌ 4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. వివిధ శాఖల నుంచి ఆలస్యంగా సమాచారం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన గ్రూప్‌ 4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. అన్నీ డిపార్ట్మెంట్ల నుంచి పూర్తి స్థాయి సమాచారం రాకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియను వాయిదా వేస్తూ టీఎస్‌ పీఎస్సీ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 33 జి ల్లాల్లోని 97 హెచ్‌ ఓడీల పరిధిలో 9,168 పోస్టుల భర్తీని టీఎస్పీఎస్సీకి అప్పగిస్తూ నవంబర్‌ 25న ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ఇచ్చింది.

ఇందులో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6859,వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1862, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు 429 జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు 18 ఉన్నాయి. అయితే తర్వాతి వారం రోజుల్లోపే డిసెంబర్‌ 1న టీఎస్‌ పీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement