Thursday, April 25, 2024

గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష వాయిదా…బండి

ఆయుష్మాన్ భారత్ లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రం లో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్ తో చేపట్టిన రేపటి ” గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష” ను వాయిదా వేస్తున్నామని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేయాలని బీజేపీ వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం పై చేసిన ఒత్తిడి ఫలించిందన్నారు బండి.

ఆయుష్మాన్ భారత్ లో చేరాలని ఆలస్యంగా నైనా రాష్ట్ర ప్రభుత్వ మంచి నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ లో కరోనా చికిత్స చేయడం తో పాటు పరిమితి ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల కు పెంచాలని డిమాండ్ చేస్తున్నామని బండి సంజయ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement