Sunday, April 14, 2024

పోర్టు బ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా టీడీపీ మహిళా నేత సెల్వి

గతేడాది అండమాన్ నికోబార్ దీవుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

పోర్టుబ్లెయిర్ మున్సిపాలిటీలో బీజేపీకి 10 స్థానాలు

కాంగ్రెస్ కూటమికి 11 స్థానాలు

2 స్థానాలతో కింగ్ మేకర్ గా మారి బీజేపీకి మద్దతు ఇచ్చిన టీడీపీ

అమరావతి, : గతేడాది అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది 2 స్థానాలే అయినా పోర్టుబ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటులో కీలకంగా మారింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 10 స్థానాలు దక్కగా కాంగ్రెస్ కూటమి 11 స్థానాలు గెలిచింది. దాంతో టీడీపీ మద్దతుతో బీజేపీ కౌన్సిల్ పీఠాన్ని అధిష్ఠించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళా నేత సెల్వి 5వ వార్డు నుంచి గెలవగా హమీద్ 1వ వార్డు నుంచి గెలిచారు. నాడు జరిగిన ఒప్పందం ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ పదవిని ఫస్ట్ టర్మ్ బీజేపీ అభ్యర్థి చేపడతారు. ఇప్పుడు రెండో టర్మ్ లో టీడీపీకి అవకాశం వచ్చింది. చైర్ పర్సన్ పదవికి టీడీపీ నేత సెల్వి పోటీపడగా బీజేపీ బలపరిచింది. చైర్ పర్సన్ బలపరీక్షలో ఎన్నికల్లో సెల్వికి 14 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థికి 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో టీడీపీ నేత సెల్వి పోర్టుబ్లెయిర్ మున్సిపల్ చైర్మన్ గా విజయం సాధించింది.

- Advertisement -

పోర్టుబ్లెయిర్ లో టీడీపీ-బీజేపీ కూటమి విజయం పట్ల జేపీ నడ్డా స్పందన

అండమాన్ నికోబార్ లోని పోర్టుబ్లెయిర్ లో టీడీపీ-బీజేపీ కూటమికే మరోసారి మున్సిపల్ చైర్ పర్సన్ పదవి దక్కడం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. పోర్టుబ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు బీజేపీ-టీడీపీ కూటమిని అభినందిస్తున్నానని తెలిపారు. పోర్టుబ్లెయిర్ ప్రజల సంక్షేమం కోసం మీ కృషి, అంకితభావం తగిన ఫలితాన్ని ఇచ్చాయని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ విజన్ పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఇది గీటురాయి వంటిదని జేపీ నడ్డా పేర్కొన్నార

Advertisement

తాజా వార్తలు

Advertisement