Thursday, April 25, 2024

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న పూజా హెగ్డే

టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే చేతినిండా సినిమాలతో చాలా బిజిగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘రాధే శ్యామ్’లో ఆమె నటిస్తోంది. దీంతో పాటు అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, బాలీవుడ్ మూబీ ‘సర్కస్’ చిత్రాల్లో పూజ నటిస్తోంది. ఈ ఏడాది పూజా హెగ్డే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే ఆమె ఐసొలేషన్ కు వెళ్లిపోయింది.

కరోనాకు చికిత్స తీసుకుని ఆమె పూర్తిగా కోలుకుంది. తాజగా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె పంచుకుంది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటోను షేర్ చేసింది. తన వయసు రెండేళ్లు ఉన్నప్పుడు తొలిసారి టీకా వేయించుకున్నానని … అప్పుడు తనతో పాటు తన తల్లి  ఉందని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement