Thursday, April 25, 2024

బైంసాలో ఆంక్షల సడలింపు

నిర్మల్ జిల్లా బైంసాలో కొన్నిరోజుల క్రితం అల్లర్లు చెలరేగడంతో అధికారులు ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో ఇరువర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు, మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. దీంతో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. సుమారు 5 రోజులుగా అన్ని దుకాణాలు మూతపడటంతో ప్రజలు నిత్యావసరాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పోలీసులు ఆంక్షలను సడలించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇవ్వడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిత్యాసరాలను కొనుగోలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement