Thursday, April 25, 2024

ఫాంహౌస్ పై పోలీసుల దాడి – ప‌లువురి అరెస్ట్

ఓ ఫాంహౌస్ పై పోలీసులు దాడి చేసి ప‌లువురు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో పోశెట్టిగుడా వ‌ద్ద ఈ ఫాంహౌస్ ఉంది. కాగా నూత‌న సంవ‌త్స‌రం వేడుక‌ల పేరుతో ఫాంహౌస్ లో మ‌ద్యం, హుక్కా తాగుతున్న యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ప‌ది హుక్కా బాటిల్స్ సీజ్ చేశారు. ఏరోస్పేస్ హోట‌ల్ లో అనుమ‌తిలేని సౌండ్ సిస్ట‌మ్ డిజేని సీజ్ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా శంషాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా 92 కేసులు నమోదు చేసినట్లు శంషాబాద్ డిసీపీ తెలిపారు.కాగా…. న్యూఇయర్ వేడుకల సమయంలో హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్‌ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులు.. హైదరాబాద్ పోలిస్ కమీషనర్ రేట్ పరిధిలో 1258 కేసులు, సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో 1528 కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement