Thursday, April 18, 2024

కంత్రీ వలంటీర్… వీడు మామూలోడు కాదు!

ప్రకాశం జిల్లా కురిచేడులో ఓ కంత్రీ వలంటీర్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక ఎస్సై, పంచాయతీ కార్యదర్శి సీట్లలో కూర్చుని ఫోటోలకు ఫోజులిస్తున్నాడు. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కురిచేడులో వలంటీర్‌గా పనిచేస్తున్న అలహరి అఖిల్.. గతంలో కూడా పలు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. విధుల నిర్వహణ నిమిత్తం ఆయా కార్యాలయాలకు వెళ్లిన సమయంలో ఉన్నతాధికారుల సీట్లలో కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చాడు. 2018లో రాజమండ్రిలో ఓ మహిళతో కలిసి సబ్ కలెక్టర్ పేరుతో బంగారు షాపు వారిని బురిడీ కొట్టించే యత్నం చేశాడు. షాపు సిబ్బంది అనుమానించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మోసం బట్టబయలైంది. ఆ సమయంలో సదరు వలంటీర్‌పై కేసు కూడా నమోదైంది. కురిచేడులోను బ్యాంక్ యాప్ ద్వారా ఓ మహిళ ఖాతా నుంచి 2.50 లక్షల నగదును అఖిల్ మాయం చేశాడు. పలువురి వద్ద రేషన్ కార్డులు ఇప్పిస్తామంటూ భారీగా నగదును అఖిల్ వసూలు చేశాడు. అఖిల్ వ్యవహారాలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement