Thursday, April 18, 2024

నాగర్ కర్నూలు జిల్లాలో పోడు వివాదం.. 9మందికి తీవ్ర‌గాయాలు

నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్‎లో పోడు వివాదం చెలరేగింది. నార్లాపూర్ – కుడుకిల్ల గ్రామ రైతుల మధ్య ఘర్షణ నెలకొంది.దీంతో ఇరు గ్రామాల రైతుల పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 9మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. పోడు భూముల సర్వే నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. సర్వేను ఆపాలని కొందరు, సర్వేను కొనసాగించాలని మరికొందరు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రెండు గ్రామాలకు చెందిన రైతుల మధ్య వివాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement