Friday, March 29, 2024

క్వాడ్​ లీడర్స్​ సమ్మిట్​లో పాల్గొనేందుకు.. 24న టోక్యో వెళ్లనున్న ప్రధాని మోదీ

మే 24న టోక్యోలో జరిగే మూడో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవ్వాల (గురువారం) తెలిపింది. రాబోయే క్వాడ్ సమ్మిట్ ఇండో-పసిఫిక్ మరియు సమకాలీన ప్రపంచ విషయాలలో పరస్పర ఆసక్తి ఉన్న పరిణామాల గురించి అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి క్వాడ్ నాయకులకు అవకాశం కల్పిస్తుందని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. టోక్యోలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌లతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement