Friday, April 19, 2024

తెలుగువారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ సహా, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వారిద్దరూ మంగళవారం తెలుగులో ట్వీట్లు చేసి ప్రజలకు అభినందనలు తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రాష్ట్రపతి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని నరేంద్రమోదీ కూడా ట్విట్టర్‌ ద్వారా తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను’ అని మోదీ ట్వీట్‌ చేశారు. కాగా, తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేసీఆర్, జగన్ లు కూడా తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు ప్రజలకు తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ప్లవ నామ సంవత్సరంలో అన్ని విధాల శుభం కలగాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి ట్వీట్ చేశారు. ప్రజలంతా ‌ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement