Thursday, March 28, 2024

అప్పుటి పీకే ట్వీట్….ఇప్పుడు వైరల్ !!

బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ గర్జించిన సింహంలా… బిజెపి పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. గతేడాది డిసెంబరు 21న ప్రశాంత్ కిశోర్ ఈ ట్వీట్ చేశారు.కాగా ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిశోర్, బీజేపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్ గతేడాది డిసెంబరు 21న ఓ ట్వీట్ చేస్తూ బెంగాల్ లో బీజేపీ మూడంకెల స్థానాలను సాధించలేదని, రెండంకెల స్థానాలకే పరిమితమవుతుందని స్పష్టం చేశారు. ఒక వేళ బీజేపీ కనుక వందకు మించి స్థానాలు సాధిస్తే తాను ట్విట్టర్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.

అంతేకాదు, ఈ ట్వీటు సేవ్
చేసుకోవాలని కూడా పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు బీజేపీ వందలోపు స్థానాలకే పరిమితం కావడంతో పీకే ఆనాడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement