Monday, April 15, 2024

హుజూరాబాద్ గడ్డ మీద గులాబీ జెండా ఎరగాలి.. కేటీఆర్

హుజూరాబాద్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. జమ్మికుంటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బైపోల్ లో ఈటలను గెలిపించారన్నారు. బీజేపీ నేతలు చాలా మాటలు చెప్పారన్నారు. హుజూరాబాద్ కు నిధుల వరద పారిస్తామన్నారు. మరి ఈ 14 నెలల్లో ఏం జరిగిందని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి ఒక్క పైసా అయినా వచ్చిందా అని అడిగారు. ఈటలను పరిచయం చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఈరోజు అదే ఈటల కేసీఆర్ ను విమర్శిస్తున్నారన్నారు. ఎంపీగా సంజయ్, ఎమ్మెల్యే గా ఈటల ఒక్క పైసా పనైనా చేశారా అని ప్రశ్నించారు. మసీదులను తవ్వేందుకేనా నిన్ను ఎంపీ చేసిందని అన్నారు. మంచినీటి కోసం, కాలువల కోసం తవ్వుదాం రా అని కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పునాధులు తవ్వుదాం రా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement