Saturday, April 20, 2024

ఫోన్‌పే ద్వారా రూ.52,000 లూఠీ

దొరికిన మొబైల్‌లో ఫోన్‌పే ద్వారా రూ.52,000 లూఠీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. సందీప్‌ శర్మ అనే వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ పోవడంతో ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 5న కొత్త మొబైల్‌ ఫోన్‌ కొన్న అతడు అందులో కొత్త సిమ్‌ వేశాడు. అనంతరం ఫోన్‌పే వాలెట్‌ను రీ యాక్టివేట్‌ చేశాడు.

అయితే గుర్తు తెలియని వ్యక్తి తన ఫోన్‌పే వాలెట్‌ నుంచి రూ.52,860 వాడినట్లు సందీప్‌ గుర్తించాడు. దీంతో బురారీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు, ఫోన్‌పే వాలెట్‌ నుంచి డబ్బులు పొందిన లబ్ధిదారుడి మొబైల్‌ నంబర్‌ ద్వారా అతడ్ని గుర్తించారు. అనంతరం ఈ నెల 6న సంజయ్‌, రాహుల్‌ దాస్‌ అనే ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement