Thursday, April 25, 2024

ఎక్కువ డబ్బులు పంచలేదని ఓటర్ల నిరసన

తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో ఓటర్లు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఓటుకు రూ. 200 నగదును వైసీపీ నేతలు పంచగా..ఓటుకు రూ.వెయ్యి ఇస్తామని తగ్గించి ఇవ్వడంపై ఓటర్ల నిరసనకు దిగారు. అటు వెంకటాచలంలో వైసీపీ నేతలు ఓటుకు రూ.500 పంచుతున్నారు. గూడూరులోని కొన్ని ప్రాంతాల్లో రూ.500, రూ.200 పంచుతున్నారు. వెంకటగిరిలో వైసీపీ నేతలు డబ్బులు ఇవ్వడం లేదని ఓటర్లు నిరసన చేపట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లో వైసీపీ నేతలు ఓటుకు రూ.వెయ్యి పంచుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement