టోక్యో ఒలింపిక్స్లో ప్రిక్వార్టర్లో తెలుగు తేజం, భారత షట్లర్ పీవీ సింధు.. మహిళల సింగిల్స్లో జరిగిన గ్రూప్ జే రెండో మ్యాచ్లో విజయం సాధించారు. ఈ విజయంతో పీవీ సింధు ప్రిక్వార్టర్కు చేరుకున్నారు. హాంకాంగ్కు చెందిన ఎన్గన్ యితో తలపడిన సింధు 21-9, 21-16 తేడాతో వరుస విజయం సాదించారు.
తొలి గేమ్ను 15 నిమిషాల్లోనే సొంతం చేసుకున్న పీవీ సింధుకు…రెండో గేమ్లో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైంది. హోరాహోరీగా సాగిన రెండో గేమ్లో మెల్లగా పాయింట్లు సాధిస్తూ.. విజయానికి సాధించింది. ఈ విజయంతో గ్రూప్ జే టాపర్గా ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది పీవీ సింధు.