Saturday, April 20, 2024

పోసానిపై జనసేన ఫిర్యాదు.. పోలీసులు ఏం అన్నారంటే..

జనసేన అధినేత, నటుడు పవన్​ కల్యాణ్ పై నటుడు​ పోసాని చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పోసానిపై జనసేన కార్యకర్తలు పంజాగుట్ట పీఎస్​లో ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదును పోలీసులు న్యాయ సలహాకు పంపారు. లీగల్ ఓపీనియన్ తర్వాత నిర్ణయం ఉంటుందని తెలిపారు.

కాగా, సినీ పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని… ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ అభిమానులు పోసాని ఫోన్​కు దుర్భాషలాడుతూ సందేశాలు పంపించడం, మాట్లాడటం చేశారు. దీంతో పోసాని పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  తన కుటుంబంపై అభిమానులతో అనుచిత వ్యాఖ్యలు చేయించిన పవన్ కల్యాణ్​పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి తెలిపారు. పవన్ కల్యాణ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు

Advertisement

తాజా వార్తలు

Advertisement