Saturday, April 20, 2024

ప్రాణం కాపాడిన పెట్రోలింగ్‌ పోలీసులు.. కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..

వికారాబాద్‌, ప్రభన్యూస్ : కుటుంబ కలహాలతో తాండూరు మండలం అంతారం తాండాకు చెందిన బిక్క్యానాయక్‌ అనే వ్యక్తి పురుగుల మందు సేవించాడు. రాత్రివేళ సమయానికి అంబులేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో పెట్రోలింగ్‌లో ఉన్న తాండూరు పట్టణ పోలీసు కానిస్టేబుళ్లు శ్రీకాంత్‌ రెడ్డి, సోహైల్‌లు విషయం తెలుసుకుని సహాయం అందించారు. బైక్‌పై బిక్క్యానాయక్‌ను తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో అతనికి చికిత్స అందేలా సహాయపడ్డారు. పోలీసులు చేసిన సహాయానికి కుటుంబ సభ్యులు, బాధితుడు బిక్క్యానాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. రాత్రి సమయంలో పెట్రోలింగ్‌ పోలీసు సిబ్బంది చేసిన సహాయక సేవలను ఉన్నతాధికారులు అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement