Tuesday, March 26, 2024

తండ్రికి బ్లాక్ ఫంగస్.. ఆస్పత్రిలోనే వదిలేసిన కుమారుడు

వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. క‌రోనా పాజిటివ్ నిర్ధ‌ర‌ణ అయిన‌ తండ్రికి బ్లాక్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌డంతో.. ఆయ‌న‌ను అతడి కుమారుడు ఆస్ప‌త్రిలోనే వ‌దిలేసి వెళ్లిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే.. రుక్కుంప‌ల్లికి చెందిన చంద్ర‌య్య‌(63)కు ఈ నెల 3వ తేదీన క‌ర‌నా పాజిటివ్ నిర్ధ‌ర‌ణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం తాండూరు ఆస్ప‌త్రిలో చేరాడు. బుధవారం ఆయ‌న‌లో బ్లాక్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. క‌న్ను, నుదుటి భాగంలో వాపు వ‌చ్చాయి. దీంతో ఇక త‌న వ‌ల్ల కాదంటూ తండ్రిని ఆస్ప‌త్రిలోనే వ‌దిలేసి కుమారుడు అక్క‌డ్నుంచి వెళ్లిపోయాడు. చేసేదేమీ లేక చంద్ర‌య్య‌.. ఆస్ప‌త్రిలోనే ప‌డిగాపులు కాస్తున్నాడు. ఆయ‌న‌ను మ‌హావీర్ ఆస్ప‌త్రికి పంపించేందుకు డాక్ట‌ర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement