Friday, March 29, 2024

ప‌ఠాన్ చిత్రాన్ని బ్యాన్ చేయాల‌ని.. ఇండోర్ లో ఆందోళ‌న‌.. షారుక్ దిష్టిబొమ్మ ద‌గ్దం

ప‌ఠాన్ చిత్రాన్ని బ్యాన్ చేయాల‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ప‌లువురు ఆందోళ‌నికి దిగారు. వీర్‌ శివాజీ గ్రూప్‌’ కార్యకర్తలు ఇండోర్‌లోని ప్రధాన కూడలిలో నిరసన చేపట్టారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కాగా ఈ సినిమాపై నిషేధం విధించాల‌ని మ‌ధ్యప్రదేశ్ మంత్రి న‌రోత్తం మిశ్రా కోరిన విషయం తెలిసిందే. ఈ మూవీలో కాషాయ దుస్తుల‌ను వాడటం ప‌ట్ల ఆయ‌న అభ్యంత‌రం వ్యక్తం చేశారు.

సినిమాలో కొన్ని అభ్యంత‌ర‌క‌ర సీన్లు ఉన్నాయ‌ని, ఈ సీన్లను మార్చనిప‌క్షంలో మ‌ధ్యప్రదేశ్‌లో పఠాన్ మూవీని బ్యాన్ చేస్తామ‌ని హెచ్చరించారు.యష్‌ రాజ్‌ ఫిలింస్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్‌ అబ్రహాం మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న ‘పఠాన్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.దీపిక ప‌దుకొణే హీరోయిన్ గా న‌టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement