Monday, April 15, 2024

అత్యుత్తమ పర్యాటక గ్రామం పోటీలో పాల్గొనండి.. గ్రామాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ‘బెస్ట్ టూరిస్ట్ విలేజ్’ పేరుతో పోటీకి తెరలేపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని గ్రామాలు ఈ పోటీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తద్వారా తమ తమ గ్రామాల్లో పర్యాటకులను ఆకట్టుకునేలా సదుపాయాలు మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. స్థానిక కళలు, సంస్కృతి, జీవనశైలిని పరిరక్షిస్తూ, ప్రోత్సహిస్తున్న గ్రామాలను సన్మానించాలన్న ఉద్దేశంతో ఈ పోటీ ఏర్పాటు చేసినట్టు ప్రధాని మోదీ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు.

కేంద్ర పర్యాటక శాఖ చేసిన ట్వీట్కు ప్రతిస్పందిస్తూ ‘‘భారతదేశ పర్యాటక సామర్థ్యాన్ని చాటిచెప్పడానికి ఈ విశిష్టమైన ప్రయత్నంలో అందరూ, మరీముఖ్యంగా యువత పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ పేర్కొన్నారు. పోటీలో పాల్గొనదల్చినవారు https://www.rural.tourism.gov.in/best-rural-village-competition.html ను సందర్శించాల్సిందిగా ప్రధాని సూచించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement