Thursday, April 25, 2024

ప్రగతిభవన్‌కు ‘పరకాల’ సెగ

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించాలని అమరవీరుల జిల్లా సాధన సమితి మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించింది. సుమారు 20 మంది సమితి సభ్యులు ప్రగతి భవన్ వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ప్రగతి భవన్ లోపలకు వెళ్లేందుకు సభ్యులు ప్రయత్నించారు. పరకాలను జిల్లా చేయాలని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. వాళ్లు ఎంతచెప్పినా వినకపోవడంతో అమరవీరుల జిల్లా సాధన సమితి సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ వార్త కూడా చదవండి: బండి యాత్ర ఎందుకు ఆగిందంటూ రేవంత్ నిలదీత

Advertisement

తాజా వార్తలు

Advertisement