Wednesday, March 27, 2024

లంచం తీసకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

దోమకొండ (ప్రభ న్యూస్) : ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ మండలం ముత్యంపేట పంచాయతీ కార్యదర్శి కృష్ణమోహన్ 7వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు అత‌డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శుక్ర‌వారం రాత్రి పంచాయతీ కార్యాలయంలోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గ్రామానికి చెందిన ఒక అనుమతి విషయంలో పంచాయతీ కార్యదర్శి ఈ లంచం డిమాండ్ చేశారు. సదరు బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా గ్రామపంచాయతీలో వ‌ల‌వేసి అత‌డిని ఏసీబీ ట్రాప్ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement