Thursday, March 28, 2024

జోరు వానలోనూ నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ పర్యటన కొనసాగుతోంది. ఆదివారం జోరు వానలోనూ ఆయన సైకిల్ యాత్రను కొనసాగించారు. కొవిడ్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర చేపట్టారు. యలమంచిలి మండలం కలగంపూడీ గ్రామానికి 15 కిలోమీటర్లు సైకిల్‌పై గొడుగు వేసుకుని ఎమ్మెల్యే పర్యటించారు. కొవిడ్ బాధిత కుటుంబాలను పరామర్శించి పౌష్టికహారం, నిత్యావసర సరుకులను అందజేశారు. కరోనా సెకండ్ వేవ్ లో తీవ్ర ఇబ్బందులకు గురైన బడుగు,బలహీనవర్గాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తెల్ల రేషన్ కార్డు దారులకు రూ.10వేలు తక్షణ సాయం అందించి, కరోనాతో మరణించిన వారికి రూ.10 లక్షలు పరిహారం అందించాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement