మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా పక్కా కమర్షియల్. కోర్ట్ రూమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కొన ఈ మూవీని బన్నీ వాసు నిర్మించారు. జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులనుంచి మార్కులే వచ్చాయి.
అయితు తాజాగా ఈ మూవీ ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను సోంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 5 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కి సిధ్దంగా ఉంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. మరింకే… థియేటర్లలో సినిమాని చూడటం మిస్ అయిన వాళ్లు ఆహాలో మూవీ రిలీజ్ కాగానే ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూసేయండి..
- Advertisement -
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.