Saturday, April 20, 2024

Breaking: అయిదో వికెట్​ కోల్పోయిన పాక్​.. మహ్మద్​ షమీకి దొరికిపోయిన ఇఫ్తీకర్​

ఐసీసీ వరల్డ్​ కప్​ టీ20లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్​లో పాకిస్తాన్ మూడు, నాలుగో వికెట్ కూడా​ కోల్పోయింది. అక్షర్​ పటేల్​ స్పిన్​ బౌలింగ్​లో సిక్సుల మీద సిక్సులు కొట్టి జోష్​ మీదున్న ఇఫ్తీకర్​ మహ్మద్​ 50 పరుగుల మైలు రాయి దాటాడు. తన 51 పరుగుల స్కోరు వద్ద పాకిస్తాన్​ టోటల్​ 91 పరుగుల వద్ద మహ్మద్​ షమీకి దొరికిపోయాడు ఇఫ్తీకర్​.

దీంతో కాస్త స్పీడందుకున్న పాకిస్తాన్​ స్కోరు మళ్లీ డౌన్​ అయ్యింది. ఇక.. హార్దిక్​ పాండ్యా బౌలింగ్​లో షాదాబ్షా​ ఖాన్ సిక్స్​ కొట్టబోయి సూర్యకుమార్​కు క్యాచ్​గా దొరికిపోయాడు. ఇదే ఓవర్లో హైదర్​ కూడా క్యాచ్​ అవుటయ్యి వెనుదిరిగాడు.. దీంతో పాక్​ 14.0 ఓవర్లలో 98 పరుగులు చేసి అయిదు కీలక వికెట్లను కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement