Thursday, March 28, 2024

ఉగాది సందర్బంగా చిన్నారులకు పెయింటింగ్ పోటీలు

ఉగాది పండుగను పురస్కరించుకుని ‘మన ఉగాది’ అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని జవహర్‌ బాలభవన్‌ పెయింటింగ్‌ పోటీలు నిర్వహిస్తోంది. చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ, ఉగాది పండుగ విశిష్టత చాటుతూ ఈ పోటీలను 5 నుంచి 16 సంవత్సరాలలోపు విద్యార్థులకు నిర్వహిస్తున్నారు. పిల్లలు సృజనాత్మకతతో రూపొందించిన బొమ్మలను ఏప్రిల్‌ 12లోపు [email protected]కు పంపించాలి. మరిన్ని వివరాలకు 9848747432 నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థుల కళాఖండాలకు బహుమతులను ప్రత్యేక కార్యక్రమంలో అందిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement