Wednesday, April 24, 2024

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ జట్టు ఎన్ని సిక్సర్లు కొట్టిందో తెలుసా?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభం కానుంది. ఇక్కడ మైదానాలు చిన్నవి కాబట్టి ప్రేక్షకులు మరోసారి ఫోర్లు, సిక్సర్ల వర్షం చూడవచ్చు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఏ జట్టు ఎన్ని సిక్సర్లు కొట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఎల్ టోర్నీ 2008లో ప్రారంభం కాగా 2021 తొలి దశ వరకు ముంబై ఇండియన్స్ జట్టు అత్యధిక సిక్సర్లు బాదింది. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అట్టడుగున నిలిచింది.

✪ ముంబై ఇండియన్స్- 1318
✪ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-1282
✪ పంజాబ్ కింగ్స్-1282
✪ చెన్నై సూపర్ కింగ్స్-1174
✪ కోలకతా నైట్‌రైడర్స్-1111
✪ ఢిల్లీ క్యాపిటల్స్-1039
✪ రాజస్థాన్ రాయల్స్-888
✪ సన్‌రైజర్స్ హైదరాబాద్-696

Advertisement

తాజా వార్తలు

Advertisement