Thursday, April 25, 2024

మన సంస్కృతి సాంప్రదాయ కళలు భావితరాలకు అందించాలి : మంత్రి ఆర్కే రోజా

తిరుపతి సిటీ : మన సంస్కృతి సాంప్రదాయ కళలు భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. రెండో రోజు స్థానిక మహతి ఆధ్వర్యంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను తిలకించి. పిల్లలతో కలిసి పాటలతో డాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. అనంతరం ఆర్కే రోజా మాట్లాడుతూ.. తాను విద్యార్థులతో కలిసి డాన్స్ వేస్తూ ఉంటే విద్యార్థి దశ గుర్తుకొస్తున్నదని తెలియజేశారు. మన సాంస్కృతికి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. జానపద కలలు ఉంన్నాయి అంటే యువత ఉత్సాహంగా వాటిలో పాల్గొనడం వల్లే బతికి ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్. విశ్వం విద్యాసంస్థల డైరెక్టర్ విశ్వ చందన్ రెడ్డి. మస్తానమ్మ రాజారెడ్డి. విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement