Saturday, March 16, 2024

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష తేదీల్లో మార్పులు..

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ తెలిపారు. ఎంఏ, ఎంకామ్‌, ఎంకామ్‌ (ఐఎస్‌), ఎమ్మెస్సీ మూడో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలను ఈ నెల 14 నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు.డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పెంపుఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ గడువును పొడగించారు. ఆరో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్ష ఫీజును రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 14వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించారు.బీఎస్సీ (ఆనర్స్‌) ఫారెస్ర్టీ పరీక్ష ఫీజు గడువు 19బీఎస్సీ (ఆనర్స్‌) ఫారెస్ర్టీ కోర్సు మొదటి, మూడో, ఐదో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్ష ఫీజును ఈ నెల 19 వరకు స్వీకరిస్తారు.

ఇది కూడా చదవండి: గూగుల్‌కు రూ.4,415 కోట్ల జరిమానా

Advertisement

తాజా వార్తలు

Advertisement