Friday, April 19, 2024

ఓటీటీ..సినిమా థియేట‌ర్ల‌లో – ఈ వారం సంద‌డి చేయ‌నున్న చిత్రాలు ఇవే

ఈ వారం సినిమా థియేట‌ర్లు..ఓటీటీలో ప‌లు సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, రాశీ ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమా యాక్షన్, కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కబోతోంది. జులై ఒకటో తేదీన విడుదల కానుంది.ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా రాకెట్రీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.. ఈ సినిమా కూడా జూలై ఒకటవ తారీఖున తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. అంతే కాదు ఇందులో షారుక్ ఖాన్, సూర్య వంటి స్టార్ హీరోలు అతిథి పాత్ర పోషించారు.అరుణ్ విజయ్ , ప్రియ భవాని శంకర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ఏనుగు.

సింగం సినిమాల దర్శకుడు హరి ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇక ఈ చిత్రం కూడా జూలై 1వ తేదీన థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో ఒకేసారి విడుదల కానుంది. సందీప్ మాధవ్ గాయత్రి ఆర్ సురేష్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై ఒకటవ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. సాయి కుమార్, బాబు మోహన్ , సురేష్ వంటివారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటితోపాటు టెన్త్ క్లాస్ డైరీస్, షికారు తదితర చిత్రాలు జూలై ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.ధాకడ్..అన్యాస్ ట్యుటోరియల్.. జూలై 1న అమెజాన్ ప్రైమ్ లో డి టర్మినల్ లిస్ట్ .. నెట్ ప్లిక్స్ లో వేదికగా జూన్ 28న బ్లాస్టెడ్ తో పాటు మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు కూడా ఓ టీ టీలో సందడి చేయనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement