Wednesday, April 17, 2024

ఓయూ పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షల తేదీల ప్రకటన

ఓయూ పరిధిలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలపై యూనివర్సిటీ ప్రకటన చేసింది. గతంలో వాయిదా పడిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలను ఈనెల 14, 16 తేదీల్లో జరపనుండగా.. నాలుగో సెమిస్టర్ పరీక్షలను జూలై 19 నుంచి నిర్వహిస్తారు. ఇక గతంలో వాయిదా పడిన డిగ్రీ మూడో, ఐదో సెమిస్టర్‌లలో మిగిలిన పరీక్షలను ఈనెల 8 నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

గతంలో జారీ చేసిన హాల్ టికెట్లనే విద్యార్థులు తీసుకురావాలని, కొత్తగా హాల్ టికెట్ జారీ చేయడం లేదని స్పస్టం చేశారు. ఇక పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లందరూ పరీక్షల నిర్వహణలో కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని యూనివర్సిటీ అధికారులు సదరు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ప్రిన్సిపాల్స్, విద్యార్థులు సహకరించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉస్మానియా యూనివర్సిటీ కోరారు.

ఇది కూడా చదవండి: సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి బీవోబీ నోటిఫికేషన్ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement