Tuesday, April 23, 2024

ప్రతిపక్షాలకు ఆలోచన, వివేకం కొరవడ్డాయి.. సీఎం జగన్

ప్రతిపక్షాలకు ఆలోచన, వివేకం కొరవడ్డాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… తమ భూముల్లో మాత్రమే రాజధాని కట్టాలనే అలోచన నుంచి ప్రతిపక్షాలు బయటపడాలని దేవుడు బుద్ది ఇవ్వాలన్నారు. తాను బటన్ నొక్కి సాయం చేస్తే వాళ్లకు పుట్టగతులుండవని ఈ పెత్తందార్లంతా కలిసి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాజధానిలో పేదలకు స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారన్నారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. కానీ ఇప్పుడు లెక్చర్లు దంచుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement