Thursday, March 28, 2024

ఓపెన్ కాస్ట్ 2,3 గనుల్లో నిలిచిపోయిన ఉత్పత్తి

భూపాలపల్లి: జయశంకర్ జిల్లా భూపాలపల్లి ఏరియా సింగరేణి ఓపెన్ కాస్ట్ 2,3 గనుల్లో గురువారం మట్టి తవ్వకాలు, బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్లకు గత రెండు నెలలుగా బిల్లు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. దీంతో సుమారు 6వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 60 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాల పనులు నిలిచిపోయాయి. సింగరేణికి ఒక్క రోజు రూ.2 కోట్ల నష్టం వాటిల్లితుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement