Tuesday, April 23, 2024

ఆ నేరాల దర్యాప్తు అధికారం ఈడీకి మాత్రమే ఉంది :ఢిల్లి హైకోర్టు

మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎమ్‌ఎల్‌ఏ) కింద మనీలాండరింగ్‌కు సంబంధించిన నేరంపై దర్యాప్తు చేయడం, విచారించే అధికారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు మాత్రమే ఉంటుందని ఢిల్లి హైకోర్టు పేర్కొంది. ముందస్తు నేరం అని దీన్ని భావించలేమని హైకోర్టు పేర్కొంది. ముందస్తు నేరాన్ని తప్పనిసరిగా దర్యాప్తు చేసి, ఆ విషయంలో చట్టం ద్వారా అధికారం పొందిన అధికారులు విచారించవలసి ఉంటుందని తెలిపింది. ఆ నేరాల కమీషన్‌పై దర్యాప్తు చేసే అధికారాన్ని ఈడీ తనకు తానుగా పెంచుకోలేదని హైకోర్టు పేర్కొంది. గమనించవలసిన విషయం ఏమంటే, సెక్షన్‌ 3 నేరాలను మాత్రమే పరిశోధించడానికి పీఎమ్‌ఎల్‌ఏ ఈడీకి అధికారం ఇస్తుంది.

దర్యాప్తుతో పాటు విచారించే అధికారం ఆ విభాగంలో నిర్వచించిన విధంగా మనీలాండరింగ్‌ నేరానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. మంగళవారం జారీ చేసిన 111 పేజీల తీర్పులో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ, ప్రిడికేట్‌ నేరం తప్పనిసరిగా దర్యాప్తు చేయాలని, చట్టం ద్వారా అధికారం పొందిన అధికారులతోనే విచారణ చేయాలని తెలిపారు. అటువంటి నేరాల పరిశోధించడం, విచారణ చేయడం అనే ప్రాథమిక విధి సంబంధిత స్వతంత్ర శాసనాల ప్రకారం ఏర్పాటైన అధికారులపైనే ఉంటుందని పేర్కొన్నారు.

షెడ్యూల్‌ చేసిన నేరానికి సంబంధించిన వాస్తవాలు రుజువు చేస్తాయని తెలిపారు. దీనిపై పీఎమ్‌ఎల్‌ఏ కింద చర్యను ప్రారంభిచాల్సి ఉంటుంది. ఈడీ నవంబర్‌ 29, 2018న జారీ చేసిన తాత్కాలిక అటాచ్‌మెంట్‌ ఆర్డర్‌లను సవాలు చేస్తూ ప్రకాశ్‌ ఇండస్ట్రీ లిమిటెడ్‌, ప్రకాశ్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్‌లను అనుమతించిన హైకోర్టు, తన తీర్పులో ఈ విధంగా స్పందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement