Wednesday, April 24, 2024

మార్చి 1వ తేదీన ప్లాట్ల ఆన్‌లైన్‌ వేలం.. ముగిసిన 38 ల్యాండ్‌ పార్సిళ్ల ప్రీబిడ్‌ సమావేశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మార్చి 1వ తేదీన హైదరాబాద్‌ శివార్లలోని మొత్తం 38 ల్యాండ్‌ పార్సిళ్లను ఆన్‌లైన్‌ వేలం ద్వారా హెచ్‌ఎండీఏ విక్రయించనుంది. ఈ ల్యాండ్‌ పార్సిళ్ల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు ప్రిబిడ్‌ సమావేశాలు విజయవంతమయ్యాయి. గురువారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని 5 ల్యాండ్‌ పార్సళ్లపై ప్రిబిడ్‌ సమావేశం నిర్వహించారు. మధ్యతరగతి ప్రజలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులు, డెవలపర్లు ఈ ల్యాండ్‌ పార్సళ్లు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో (10), మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో (5), సంగారెడ్డి జిల్లాల్లో 23 ల్యాండ్‌ పార్సిల్స్‌ కొనుగోలుదారుల కోసం సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement