Tuesday, April 16, 2024

Follow up | కొనసాగుతున్న మార్కెట్‌ నష్టాలు

స్టాక్‌ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కొద్ది సేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. రోజంతా ఒడుదొడుకులకు లోనైన సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి. దీంతో వరసగా 8వ రోజు కూడా మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్‌ 326.23 పాయింట్లు నష్టపోయి 58962.12 వద్ద ముగిసింది. నిఫ్టీ 88.75 పాయింట్లు నష్టపోయి 17303.95 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 298 రూపాయలు తగ్గి 55178 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 289 రూపాయలు తగ్గి 62675 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.64 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు..

ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పోరేషన్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా, అందానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు..

టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌ కంపెనీ, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, సన్‌ ఫార్మా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, బీపీసీఎల్‌, దివీస్‌ ల్యాబ్‌, హీరో మోటార్‌ కార్ప్‌, అపోలో ఆస్పటల్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీ ల్యాబ్స్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement