Thursday, April 25, 2024

గుర్తుతెలియని వాహనం ఢీకొని చిన్నారి చిరుత మృతి.. కొడైకెనాల్​ కొండప్రాంతంలో ఘటన..​

తమిళనాడులోని కొడైకెనాల్‌లో ఏడాది వయసున్న చిరుతపులి గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయింది. అయితే రోడ్డు మధ్యలో చిరుత మృతదేమం పడి ఉండగా.. దాన్ని అడవి పందులు కొరుక్కు తింటున్న దృశ్యాలను ఆ ప్రాంతంలోని ఓ వాహనదారుడు చిత్రీకరించి సోషల్​ మీడియాలో పోస్టు చేశాడు.

చనిపోయిన చిరుతను పందులు కొరికేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో  వైరల్‌గా మారాయి. అటవీ జంతువులు ఈ ప్రాంతంలో తిరుగుతాయి కాబట్టి.. అటుగా వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, జంతువులకు హాని కలిగించకుండా ప్రయాణం కొనసాగించాలని అటవీ అధికారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement