Saturday, April 20, 2024

అన్న‌దాత అవ‌స‌రాల వేదిక – వ‌న్ స్టాప్…వ‌న్ నేష‌న్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్తరకం సేవలను అందుబాటులోకి తీసుకురాబో తోంది. వ్యవసాయ రంగంలో ‘వన్‌ స్టాప్‌ – షాప్‌ నేషన్‌’ సేవలు అందించేందుకు తెలంగాణ ఆగ్రోస్‌ సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో విత్తనం మొదలుకుని పంట కోతల వరకు రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఓ అడుగు ముందుకు వేసి ఆ సేవలు మరింత విస్తృతంగా అందుబాటు-లోకి తీసుకురావా లని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక సిద్ధమైంది. తాజాగా టీ-ఎస్‌ ఆగ్రోస్‌ ఆధ్వర్యంలో విత్తన, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, పనిముట్లు-, యంత్ర పరిశ్రమల ప్రతినిధులు, ఆగ్రోస్‌ సేవా కేంద్రాల నిర్వా హకులతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. వన్‌ నేషన్‌ – వన్‌ రేషన్‌ కార్డు, వన్‌ నేషన్‌ – వన్‌ మార్కెట్‌ తరహాలో వన్‌ స్టాప్‌ షాప్‌ సేవలు అందించేందుకు అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రధాన ఆహార పంట వరి సహా వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, పప్పుధాన్యాలు, ఇతర పంటల విత్తనాలు, ట్రాక్టర్లు, హర్వెస్టర్లు, ప్లాంటర్లు, ఇతర భూసార పరీక్షల సేవలు సైతం అందించేందుకు రైతులకు అవసరమైన శిక్షణ కూడా ఇప్పించాలని నిర్ణయించారు. అన్ని రకాల రైతుల అవసరాలను తీర్చేందుకు ఈ కొత్త పథకం ఒక వేదిక కానుంది. గత ఏడాది అక్టోబరులో వన్‌ నేషన్‌ వన్‌ ఫెర్టిలైజర్‌ స్కీం ప్రధాని మోడీ ఆవిష్కరించిన నేపథ్యంలో రైతులకు ప్రయోజనం కలుగనుంది. పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలు, ఇండియన్‌ ఎడ్జ్‌ అనే ఇ-మ్యాగజైన్‌ ఆవిష్కరించిన తరుణంలో దేశీయ, అంతర్జాతీయ ఎరువులకు సంబంధించి ఇటీ-వల పరిణామాలు, ధరల పోకడలు, విశ్లేషణ, లభ్యత, వినియోగం, రైతుల విజయగాథలు వంటి సమాచారం పొందొచ్చు. వన్‌ నేషన్‌ వన్‌ ఫెర్టిలైజర్‌ స్కీమ్‌ కింద రాయితీ కింద అందిస్తున్న అన్ని యూరియా, డి-అమ్మోనియం ఫాస్ఫేట్‌, మ్యూరియేట్‌ ఆఫ్‌ పొటాష్‌, ఎన్‌పీకే వంటివి దేశవ్యాప్తంగా ఒకే బ్రాండ్‌ భారత్‌ కింద విక్రయిస్తారు.

ఈ నేపథ్యంలో దేశంలో తొలిసారిగా తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న దృష్ట్యా, పల్లెల్లో చిల్లర మార్కెట్‌లో టీ-ఎస్‌ ఆగ్రోస్‌ బ్రాండ్‌పై విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ఉత్పత్తులు విక్రయించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. అన్ని బ్రాండ్లకు చెందిన డీఏపీ ఎరువుల్లో తప్పనిసరిగా 18శాతం నత్రజని, 46శాతం భాస్వరం ఉండాల్సిందే. వన్‌ నేషన్‌ వన్‌ ఫెర్టిలైజర్‌ ద్వారా రైతుల్లో ఎరువుల ఎంపికల్లో ఏ విధమైన గందరగోళం ఉండదు. రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతు న్న సాగు విస్తీర్ణం దృష్ట్యా రెండేళ్ల కిందట ఆగ్రోస్‌ సేవా కేంద్రాలు ఏర్పాటు- చేసిన ఆ సంస్థ, వ్యవసాయ పట్టభద్రులైన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతోపాటు- ఔత్సాహిక వ్యాపారులుగా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలో 33 జిల్లాల్లో 1000 పైగా ఆగ్రోస్‌ సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర ఉపకరణాలు అందజేస్తూ అన్నదాత సేవలో నిమగ్నమైంది. వన్‌ స్టాప్‌ షాప్‌ సేవలు అందుబాటు-లోకి వచ్చిన-్లటెతే రైతు సమయం వృధా తగ్గిపోతుంది. అన్నీ ఒకే చోట సరసరమైన ధరలకు నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని, ఈ కాన్సెప్ట్‌ ఎంతో బహుళ ప్రయోజ నకరంగా ఉంటు-ందని ఆగ్రోస్‌ సేవా కేంద్రాల యజమానులు చెప్పారు.
వన్‌ స్టాప్‌ షాప్‌ కింద సిద్ధిపేట, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి తదితర 10జిల్లాల నుంచి ఒక్కొక్కరి చొప్పున 10మంది ఆగ్రోస్‌ నిర్వాహకులను సంస్థ ఎంపిక చేసింది. మార్కెట్‌ సర్వే ఆధారంగా వచ్చే ఖరీఫ్‌ నుంచి పైలట్‌ ప్రాజెక్టు కింద వన్‌ స్టాప్‌ షాప్‌లు నెలకొల్పి రైతులకు బహు ళార్థక సేవలందించేందుకు సిద్ధం చేస్తుండటం శుభ పరిణామ మని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement