Friday, April 19, 2024

బైక్ మీద నుంచి ప‌డి ఒక‌రు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో ఘ‌ట‌న‌

సొన్ (ప్రభ న్యూస్): సొన్ బ్రిడ్జ్ పై బైక్ అజాగ్ర‌త్త‌గా నడుపుతూ కింద పడడంతో ఒక‌రు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లా ఆలూరు మండ‌లంలో జ‌రిగింది. ఎస్ ఐ రవీందర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మృతుడు ఆలూరు మండ‌లం రాలుక‌ళ్లేడి గ్రామానికి చెందిన‌ గోపు శేఖర్ (47)గా గుర్తించారు. మోటార్ సైకిల్ పై మాదాపూర్ గ్రామంలోని భూమిని చూడటానికి వచ్చి, తిరిగి వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సొన్ గోదావరి బ్రిడ్జి వద్దకు రాగానే మోటార్ సైకిల్ అదుపుత‌ప్పింది. దీంతో రోడ్డుమీద ప‌డిపోయాడు. తలకు బలమైన గాయం కావ‌డంతో చ‌నిపోయాడు. కేసు న‌మోదు చేసి త‌దుప‌రి దర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement