Thursday, March 28, 2024

వనపర్తి జిల్లాలో దారుణం.. బర్రెపై అత్యాచారం చేసిన వ్యక్తి.. అంతలోనే మృతి

కొందరు మనుషులు మృగాల తరహాలో ప్రవర్తిస్తున్నారు. వాయి, వరుస లేకుండా మహిళలపై దాడి చేస్తున్నారు. మరికొందరు మూగజీవాలపైనా అకృత్యాలకు పాల్పడుతున్నారు. వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి మూగజీవంపై దారుణానికి ఒడిగట్టాడు. వనపర్తి జిల్లాలోని నాగవరంలో అదే ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల నాగరాజు కూలీగా పని చేస్తుండేవాడు. అయితే నాగరాజుకు పశువులపై అత్యాచారం చేసే అలవాటు ఉంది.

ఈ నేపథ్యంలో నాగవరంలోని బాల్‌ రెడ్డి అనే యజమానికి చెందిన బర్రెలను తన ఇంటి ముందు కట్టేసి ఉంచాడు. దీంతో శనివారం రాత్రి వాటిపై నాగరాజు అత్యాచారం చేయబోయాడు. అయితే తెల్లారి లేచి చూసిన ఇంటి యజమాని బాల్‌ రెడ్డి షాక్‌ అయ్యాడు. బర్రె తోకకు చట్టుకుని పశువుల కొట్టంలోనే పడి ఉన్న నాగరాజు కనిపించాడు. దీనిని గమనించిన వెంటనే బాల్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్‌ మార్టం నిమిత్తం నాగరాజు మృతదేహాన్ని ఆస్పత్రికి పంపించారు. ఈ నివేదికలో నాగరాజు బర్రెలపై అత్యాచారానికి ప్రయత్నం చేసినట్టు బయటపడింది. ఈ విషయాన్ని పోలీసులు కూడా నిర్ధారించారు.

ఈ వార్త కూడా చదవండి: బీజేపీలో చేరిన కరాటే కళ్యాణి

Advertisement

తాజా వార్తలు

Advertisement