Thursday, April 18, 2024

వరంగల్ జిల్లాలో దారుణం.. చెట్టుకు కట్టేసి గొంతులో కత్తితో పొడిచి హత్య

వరంగల్ జిల్లా సంగెం మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తీగరాజుపల్లిలో హంస సంపత్ (50)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సంపత్‌ను చెట్టుకు కట్టేసి కత్తితో గొంతులో పొడిచి చంపేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: కృష్ణా జిల్లాలో అగ్నిప్రమాదం… భారీ ఆస్తినష్టం

Advertisement

తాజా వార్తలు

Advertisement