Tuesday, April 23, 2024

ముక్కోణపు ప్రేమకథ.. లాటరీ ద్వారా వధువు ఎంపిక

కర్ణాటకలో ఓ ముక్కోణపు ప్రేమకథ జరిగింది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీలోని ట్విస్టులు సినిమాల్లో సైతం చూసుండరు. కర్ణాటకలోని హాసన జిల్లా సకలేశపుర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమాయణం సాగించాడు. ఆ ఇద్దరూ యువతులు ఆ యువకుడిని చచ్చేంత ప్రేమించారు. ఇద్దరూ అతన్నే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.


అయితే ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలో యువకుడికి అర్థం కాలేదు. చివరకు గ్రామస్తులు ఈ విషయంపై పంచాయతీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఓ యువతి విషం కూడా తాగింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సదరు యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సమస్యకు పరిష్కారంగా గ్రామ పెద్దలు లాటరీ ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని యువతులకు చెప్పారు. లాటరీలో ఎంపికైన అమ్మాయే యువకుడిని పెళ్లి చేసుకోవాలనే షరతు విధించారు. దీనికి ఇద్దరు యువతులు అంగీకరించడంతో లాటరీ తీయగా విషం తాగిన అమ్మాయి పేరే వచ్చింది. ఇలా ఈ కథ సుఖాంతమైంది.

ఈ వార్త కూడా చదవండి: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

Advertisement

తాజా వార్తలు

Advertisement