Friday, April 19, 2024

ఆగని పెట్రో డీజిల్ మంటలు!!

దేశంలో ఓవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువ అవుతుంటే… పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 100 రూపాయల మార్కును కూడా దాటిపోయాయి. డీజిల్ రేట్లు సైతం సెంచరీ వైపు పరుగులు పెడుతోంది. తాజాగా పెట్రోల్ పై లీటర్ కు 28 పైసలు, డీజిల్ పై 25 పైసలు పెరిగాయి.

పెరిగిన ధరల ప్రకారం హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర 99.90 కాగా డీజిల్ ధర 94.82 చేరింది. ఇక జూన్ నెలలో ఇప్పటివరకూ ఆరు సార్లు ధరలు పెరిగాయి. మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ ధర పై 5 రూపాయల 81 పైసలు ,డీజిల్ పై 6 రూపాయల 12 పైసలు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement