Wednesday, April 24, 2024

10వేల కోట్ల‌తో తెలంగాణలో ఓలా కార్ల ఫ్యాక్టరీ.. స్థల సేకరణలో యాజమాన్యం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రతిష్టాత్మక విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఓలా తెలంగాణలో ఈవీ కార్ల పరిశ్రమ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థల సేకరణ దిశగా ఆ సంస్థ దృష్టి సారించినట్టు తెలిసింది. ఇప్పటికే డిజైన్లు సిద్ధం చేసిన ఈ సంస్థ తయారీ కేంద్రం నిర్మాణం కోసం హైదరాబాద్‌ సమీపంలో అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పరిశ్రమలశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దాదాపు 1000 ఎకరాల్లో కారు, బ్యాటరీ సెల్‌ తయారీకి సంబంధించిన గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రణాళికలు రచించినట్లు సదరు అధికారి వెల్లడించారు. అందుకోసం తెలంగాణ సహ ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే నెల ఆరంభానికి భూ కేటాయింపు విషయంలో తుది నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది.

దాదాపు రూూ.10వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఓలా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓలా ఎలక్ట్రిక్‌కు ఇప్పటిికే తమిళనాడులోని కృష్ణగిరి 500 ఎకరాల్లో ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కేంద్రం. తాజాగా సేకరించనున్న 1000 ఎకరాలు ప్రత్యేకంగా కారు, వాటి బ్యాటరీకి అవసరమయ్యే సెల్స్‌ తయారీ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నారు. 2020 డిసెంబర్‌లో ఓలా విద్యుత్‌ స్కూటర్ల తయారీని తమిళనాడులో ప్రారంభించింది. గత ఏడాది డిసెంబర్‌ 15న వినియోగదారులకు డెలివరీలు అందజేసింది. వచ్చే రెండు, మూడేళ్లలో ఓలా నుంచి తొలి విద్యుత్‌ కారు రాబోతోందని కంపెనీ సీఈవో భవీష్‌ అగర్వాల్‌ ఇప్పటికే ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement