Saturday, April 20, 2024

Breaking: నంద్యాల జిల్లాలో క్షుద్రపూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా డోన్‌లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. డోన్ మండలం దొరపల్లి లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో క్షుద్రపూజలు జరిగినట్లు గ్రామస్తులు గుర్తించారు. ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఘటనా స్ధలంలో పుర్రె, ఎముకలు కనిపించాయి. అలాగే అక్కడ పూజ చేసిన కుంకుమ, పసుపు ను గుర్తించారు. ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల చేసిన ఆనవాళ్లు ఉండటంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement